వాళ్లని బిలియనీర్లుగా చేసిందే కాంగ్రెస్
NEWS Nov 21,2024 05:21 pm
అదానీ, అంబానీలను బిలియనీర్లుగా చేసిందే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శించారు. ఇప్పుడు అదానీని అరెస్టు చేయలని రాహుల్ గాంధీ డిమాండ్ చేయడం వారి దంద్వ విధానాలను వెల్లడిస్తుందన్నారు. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని, CBI విచారణ జరిపించాలన్న సీఎం రేవంత్ ఏడాది గడిచిన ఎందుకు మెఘా కృష్ణారెడ్డిని అరెస్టు చేయలేదని, ఇప్పుడు రేవంత్కు ఆయన బెస్ట్ ఫ్రెండ్ ఎలా అయ్యాడని పాల్ ప్రశ్నించారు.