అంజన్న ఆలయంలో హుండి లెక్కింపు
NEWS Nov 21,2024 05:22 pm
కొండగట్టు: జగిత్యాల జిల్లా శ్రీ కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ హుండీ లెక్కింపు గురువారం రోజున శ్రీ లలితా సేవా ట్రస్ట్ వారిచే చేపట్టారు. 75 రోజులకు 12 హుండీలు లెక్కించగా రూ. 1 కోటి 4 లక్షల 36 వేల 365 ల నగదు 60 గ్రాముల మిశ్రమ బంగారం 3 కిలోల వెండి 78 విదేశీ కరెన్సీ నోట్లు సమకూరినట్లు ఆలయ ఈవో రామకృష్ణారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ అంజయ్య, ఆలయ సిబ్బంది సునీల్, చంద్రశేఖర్, హరిహరనాథ్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.