హెల్త్ సబ్ సెంటర్ బిల్డింగ్ పనులకు భూమిపూజ
NEWS Nov 21,2024 12:46 pm
వేంపేటలో హెల్త్ సబ్ సెంటర్ భవన నిర్మాణ పనులకు ప్రజాప్రతినిధులు భూమిపూజ చేశారు. 2 సంవత్సరాల క్రితం సబ్ సెంటర్ కు నిధులు మంజూరు కాగా, స్థలం లేక ఇప్పటి వరకూ నిర్మాణం చేపట్టలేదు. విషయం తెలుసుకున్న బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లూరి మహేందర్ రెడ్డి చొరవ తీసుకొని మాజీ సర్పంచ్ మారంపల్లి శ్రీనివాస్, గుములాపూర్ మాజీ MPTC వెంకటేశ్ను ఒప్పించి వారి స్వంత భూమి 3 గుంటల్లో హెల్త్ సెంటర్ నిర్మిస్తున్నారు.