నిరసన ప్రదర్శన జయప్రదం చేయండి
NEWS Nov 21,2024 12:38 pm
కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నవంబరు 26న జిల్లా కేంద్రంలో జరిగే నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలని కిసాన్ మోర్చా , జెయింట్ ప్లాట్ ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ సంయుక్తంగా పిలుపునిచ్చాయి. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు, గిరిజన సంఘం ఆధ్వర్యంలో కరపత్రాలను పట్టణంలోని గాంధీ పార్క్ వద్ద ఉన్న ప్రజలకు పంపిణీ చేసారు.