సన్నరకం ధాన్యాన్ని పరిశీలించిన ఏడీఏ
NEWS Nov 21,2024 12:32 pm
ఇబ్రహీంపట్నం మండలం మూలారంపూర్ లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో సన్నరకం వరి ధాన్యాన్ని మెట్ పల్లి ఏడీఏ రమేశ్ గురువారం పరిశీలించారు. సన్నరకం వరి ధాన్యాన్ని మిషన్తో తనిఖీ చేసి దాని నాణ్యతను నిర్ధారించాలన్నారు. అనంతరం గ్రామంలోని పలు ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేశారు. ఫర్టిలైజర్ షాప్ నిర్వాహకులు రిజిస్టర్ సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు.