రైల్వే వంతెనపై శాశ్వత గడ్డర్లు ఏర్పాటు
NEWS Nov 21,2024 04:07 pm
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు రోడ్డు కం రైల్వే వంతెనపై భారీ వాహనాలు ప్రయాణించకుండా నిరోధించడానికి శాశ్వత గడ్డర్లను గురువారం రైల్వే శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. గతంలో R&B అధికారులు ఏర్పాటు చేసిన గడ్డర్లను భారీ వాహనాలు ఢీకొనడంతో వాటి స్థానంలో శాశ్వత గడ్డర్లను ఏర్పాటు చేశారు. దీనితో వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.