డిసెంబర్ 3న ప్రజాపాలన బహిరంగ సభ
NEWS Nov 21,2024 04:22 am
TG: కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా డిసెంబర్ 3న ప్రజాపాలన బహిరంగ సభ నిర్వహించాలని సీఎం రేవంత్ నిర్ణయించినట్లు సమాచారం. హైదరాబాద్లో జరిగే ఈ సభకు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీల్లో ఒకరిని ఆహ్వానించాలని భావిస్తున్నారు. దీనితో పాటు నామినేటెడ్ పదవులు, పలు కార్పొరేషన్ ఛైర్మన్ల భర్తీపై నిన్న పార్టీ కీలక నేతలతో సీఎం చర్చించినట్లు సమాచారం.