ప్రజలతో ‘మీ ముఖ్యమంత్రి’ కార్యక్రమం
NEWS Nov 21,2024 04:11 am
AP: ప్రజలతో నేరుగా మాట్లాడాలని సీఎం చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది. 1995-2004 మధ్య డయల్ యువర్ సీఎం కార్యక్రమం నిర్వహించగా, అదే తరహాలో సంక్రాంతి నుంచి ప్రజలతో మీ ముఖ్యమంత్రి కార్యక్రమం చేపట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. దీనిని ఆడియో/వీడియో విధానంలో ఎలా చేయాలన్న దానిపై అధికారులతో సీఎం సమాలోచనలు చేస్తున్నారు. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకొనున్నారు.