నేడు ఇసుక డంపుల బహిరంగ వేలం
NEWS Nov 21,2024 03:15 am
మల్లాపూర్ మండల పరిధిలో ఇటీవల రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు పట్టుకున్న ఇసుక డంపులకు బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లుగా తహసీల్దార్ ఎల్.వీర్ సింగ్ నాయక్ తెలిపారు. ఈనెల 18న సాతారంలో పట్టుకొని నిలువ ఉంచిన 13 ట్రిప్పుల ఇసుకకు, 21న వేలం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి కలవారు బహిరంగ వేలంలో పాల్గొనాలని తహసీల్దారు సూచించారు.