మెట్ పల్లిలో అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభం
NEWS Nov 21,2024 03:14 am
మెట్ పల్లి పట్టణంలోని అంబేద్కర్ స్టేడియంలో జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలను మున్సిపల్ చైర్పర్సన్ రాణవేని సుజాత, డాక్టర్ ఆనంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. క్రీడల వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుందన్నారు. స్నేహాభావం పెరుగుతుందన్నారు. అనంతరం జిల్లా అథ్లెటిక్స్ సెక్రటరీ మాట్లాడుతూ.. జిల్లాస్థాయిలో సెలెక్ట్ అయిన 25 మందిని డిసెంబర్ లో రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఏలేటి ముత్తయ్య రెడ్డి, సంఘం ఉపాధ్యక్షులు జి రాందాస్, గంగాధర్ పాల్గొన్నారు.