పాఠశాలలో శుద్ధ జల ప్లాంటు ఏర్పాటు
NEWS Nov 21,2024 02:55 am
ములుగు: దేవగిరిపట్నం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో DNR ట్రస్ట్, ఉపాధ్యాయుల సహకారంతో శుద్ధ జల ప్లాంటును ఏర్పాటు చేశారు. నీటి శుభ్రత లేక విద్యార్థులు అనారోగ్యం పాలవుతూ స్కూల్కు గైర్హాజరవుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా శుద్ధ జల ప్లాంటుకు ఆర్థిక సాయం అందించిన DNR ట్రస్ట్ ఫౌండర్ దొడ్డ ప్రతాపరెడ్డికి, ఉపాధ్యాయులకు ప్రధానోపాధ్యాయుడు ధన్యవాదాలు తెలిపారు.