2 రోజుల పర్యటన కోసం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నేడు హైదరాబాద్కు వస్తున్నారు. నేడు సా.6 గంటలకు స్పెషల్ ఫ్లైట్లో బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. సా.7.20కి ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న కోటి దీపోత్సవంలో పాల్గొంటారు. రేపు ఉదయం హైటెక్సిటీలోని శిల్పకళా వేదికలో లోక్మంథన్-2024 కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అనంతరం తిరిగి ఢిల్లీకి ప్రయాణమవుతారు.