ఫుడ్ పాయిజన్తో విద్యార్థులకు అస్వస్థత
NEWS Nov 20,2024 05:26 pm
TG: నారాయణపేట జిల్లా మాగనూర్ జడ్పీ స్కూల్లో మధ్యాహ్నం భోజనం వికటించి 50 మందికిపైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. వారిని మహబూబ్నగర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని స్కూళ్లలో అసలేం జరుగుతోందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.