రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి
NEWS Nov 20,2024 04:45 pm
రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామానికి చెందిన యువ రైతు ఇర్రి రాజశేఖర్ రెడ్డి రాగట్లపల్లి నుండి తన గ్రామమైన పదిరకు వెళ్తున్న క్రమంలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి రహదారి పక్కన ఉన్న చెట్టుకు ఢీకొని తలకు బలమైన గాయాలయి మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతుడికి భార్య శ్రీజ, కుమారుడు విహాన్ రెడ్డి, కూతురు నిహారిక, తల్లి దేవవ్వ ఉన్నారు.