గంభీర్పూర్కు బస్సు నడపాలని వినతి
NEWS Nov 20,2024 02:20 pm
కథలాపూర్ మండలం గంభీర్పూర్ గ్రామానికి 2 ఆర్టీసీ బస్సులను కంటిన్యూగా నడిపించాలని కోరుట్ల డిపో మేనేజర్ మనోహర్కు గ్రామస్థులు బుధవారం వినతిపత్రం ఇచ్చారు. గతంలో గ్రామానికి రెండు ఆర్టీసీ బస్సులను కంటిన్యూగా నడిపించే వారన్నారు. ఇటీవల వాటిని రద్దు చేయడంతో గ్రామస్థులు, పాఠశాల, కళాశాల విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు.