ఎక్సైజ్ దాడుల్లో ఇద్దరిపై కేసు నమోదు
NEWS Nov 21,2024 12:56 pm
ఆలమూరు ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో బుధవారం నిర్వహించిన దాడులలో ఇద్దరు వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. సర్కిల్ పరిధిలోని మండపేటలో బెల్ట్ షాప్ నిర్వహిస్తున్నట్లు సమాచారం మేరకు దాడి నిర్వహించి పది మద్యం బాటిల్స్తో కే శ్రీనివాస్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు ఆలమూరు ఎక్సైజ్ సీఐ ఐడి నాగేశ్వరరావు తెలిపారు. బెల్ట్ షాపులు నిర్వహించడం నేరమని షాపులు నిర్వహణపై సమాచారం ఇవ్వాలన్నారు.