దేవాలయం నిర్మాణానికి భూమి పూజ చేసిన హంపి పీఠాధిపతి
NEWS Nov 20,2024 12:38 pm
మెట్పల్లి పట్టణంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మార్కండేయ స్వామి దేవాలయం నిర్మాణానికి హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామి బుధవారం భూమి పూజ చేశారు. పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామికి భక్తులు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.