సీఎం రేవంత్ రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్నారు. వేములవాడలో సీఎం రేవంత్ రాజరాజేశ్వర స్వామి దర్శనం చేసుకుని, అభిషేకం నిర్వహించి కోడెమొక్కులు చెల్లించుకున్నారు. సీఎంతో పాటు మంత్రులు వేములవాడ ఆలయ అభివృద్ధికి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. రూ. 800 కోట్లతో వివిధ అభివృద్ధి సంక్షేమ పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేస్తున్నారు.