మళ్లీ పెరిగిన బంగారం ధరలు
NEWS Nov 20,2024 07:08 am
హైదరాబాద్ మార్కెట్లో 3వ రోజు కూడా బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రా. గోల్డ్ రేటు రూ.550 పెరిగి రూ.77,620కి చేరింది. 22 క్యారెట్ల పసిడి 10గ్రా. ధర రూ.500 పెరిగి రూ.71,150గా నమోదైంది. అయితే వెండి ధరల్లో ఎలాంటి మార్పులు జరగలేదు. కేజీ వెండి ధర రూ.1,01,000గా ఉంది.