మహారాష్ట్రలో కొనసాగుతున్న పోలింగ్
NEWS Nov 20,2024 06:54 am
మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. 9.63 కోట్ల మంది ఓటర్లు 4 వేల 136 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. ఠాణే పోలింగ్ కేంద్రంలో మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ శిందే, ఆయన కుటుంబ సభ్యులు ఓటు వేశారు. పలువురు సినీ రాజకీయ, క్రీడా ప్రముఖులు ఓటేశారు.