తిమ్మాపూర్లో బీజేపీ నాయకుడిపై దాడి
NEWS Nov 20,2024 07:02 am
జగిత్యాల రూరల్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు దుబ్బాక రమేశ్పై ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి గాయపరిచినట్లు గ్రామస్థులు తెలిపారు. రమేశ్ ఇంటి వద్ద ఉండగా నలుగురు వ్యక్తులు కర్రలతో వచ్చి ఏకధాటిగా దాడి చేయడంతో తీవ్ర గాయాల పాలయ్యారన్నారు. రమేశ్ను చికిత్స నిమిత్తం జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. దాడికి కారణాలు తెలియాల్సిందని పోలీసులు తెలిపారు.