పెదపూడి సత్యసాయి సేవాకేంద్రం వద్ద గురువారం ఉదయం 9గంటలు నుండి ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తారని కాకినాడ జిల్లా సత్య సాయి సేవా కేంద్రం అధ్యక్షుడు యార్లగడ్డ గోవిందరాజులు ఒక ప్రకటనలో తెలిపారు. శిబిరంలో చత్వార పరీక్షలు, తలపోటు పరీక్షలు, కంటిలో శుక్లాలు ఉన్న వారికి క్యాటరాక్ట్ ఆపరేషన్లు ఉచితంగా చేస్తారన్నారు. ప్రజలు ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.