రూ. 75 వేల LOC చెక్కు అందజేత
NEWS Nov 20,2024 05:13 am
మెట్ పల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టణానికి చెందిన పి. కళావతికి మంజూరైన రూ.75,000 విలువగల LOC చెక్కును బాధిత కుటుంబ సభ్యులకు కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.