సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
NEWS Nov 20,2024 05:12 am
సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ కిరణ్ కుమార్ అన్నారు. జగిత్యాల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో సైబర్ నేరాల పట్ల నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. సైబర్ మోసానికి గురైతే 1930కి వెంటనే కాల్ చేసి ఫిర్యాదు చేస్తే మనం కోల్పోయిన డబ్బును తిరిగి రాబట్టుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఉప ప్రధాన ఆచార్యులు చంద్రయ్య, అధ్యాపకులు వాసవి, ప్రమోద్ కుమార్, వరప్రసాద్ సంగీత రాణి తదితరులున్నారు