6గురు పంచాయతీరాజ్ సిబ్బంది సస్పెండ్
NEWS Nov 19,2024 03:14 pm
ముత్తారం ఎంపీడీవో కార్యాలయానికి ఉదయం 11.30 గంటలకు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు జిల్లా కలెక్టర్. సిబ్బంది విధులకు గైర్హాజరవడం గమనించారు. బయోమెట్రిక్ అటెండెన్స్ రిజిస్టర్లు పరిశీలించగా ఆ సిబ్బంది అనుమతి లేకుండా చాలా రోజులుగా విధులకు డుమ్మా కొట్టడం గమనించిన కలెక్టర్, పలుమార్లు ఆ సిబ్బందికి మెమోలు జారీ చేసినప్పటికీ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ సస్పెండ్ చేశారు.