గంజాయి తరలిస్తున్న ముగ్గురు అరెస్ట్
NEWS Nov 19,2024 11:11 am
ఇబ్రహీంపట్నం మండలం బండలింగాపూర్లో గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పట్టుకొని వారి వద్ద 220 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత కొంత కాలంగా వీరు నాందేడ్ నుండి గంజాయి కొనుగోలు చేసి చిన్న పొట్లాలుగా కట్టి వాటిని 500 రూపాయలకు ఒక్కటి చొప్పున అమ్ముతున్నారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు. యువత చెడు వ్యసనాలకు బానిసలు కావద్దని పోలీసులు కోరారు.