ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుక
NEWS Nov 19,2024 10:13 am
ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకలను తపస్ ఆధ్వర్యంలో చేగుంటలో నిర్వహించారు. ఈ సందర్భంగా తపస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవాత్ సురేష్ మాట్లాడుతూ.. ఝాన్సీ లక్ష్మీబాయి 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటులో కీలక పాత్ర వహించిందంటూ ఆమె పోరాటాన్ని కీర్తించారు. ఈ కార్యక్రమంలో తపస్ నాయకులు చల్లా లక్ష్మణ్, ఉపాధ్యక్షులు దేశపతి కృష్ణమూర్తి, సుమతి, వెంకటేష్, సుమలత, రజనీదాస్ పాల్గొన్నారు.