మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసూతి నిమిత్తం ఓ మహిళకు అత్యవసర పరిస్థితిలో ఓ పాజిటివ్ రక్తం అవసరమైంది. వారి బంధువులు కోరుట్ల సోషల్ సర్వీస్ గ్రూప్ అడ్మిన్ ఆమెర్ ఖాన్ కు సమాచారం ఇవ్వగా అతను వెంటనే స్పందించి తన గ్రూప్ సభ్యుడు శాశ్వతా రక్తదాత షోయబ్ అలీ ఖాన్ ను రక్తం ఇవ్వమని కోరగా, అతను జగిత్యాల పట్టణంలోనీ రక్తనిధికి వెళ్లి 5వ సారిగా రక్త దానం చేశాడని కోరుట్ల సోషల్ గ్రూప్ అమేర్ అలీ ఖాన్ తెలిపారు.