ఇందిర సేవలు మరువలేనివి చైర్మన్
NEWS Nov 19,2024 09:00 am
కామారెడ్డి జిల్లా బాన్సువాడ: ఇందిరాగాంధీ దేశానికి చేసిన సేవలు మరువలేనివని ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్ అన్నారు. బాన్సువాడ పట్టణంలో మంగళవారం ఇందిరా గాంధీ జయంతి నిర్వహించారు. మున్సిపల్ ఛైర్మన్ గంగాధర్ ఆధ్వర్యంలో ఇందిరా చౌరస్తాలో విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బాన్సువాడ సొసైటీ ఛైర్మన్ కృష్ణారెడ్డి, కాంగ్రెస్ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు కాలెక్, మధుసూదన్ రెడ్డి, నార్ల రవీందర్, అప్రోజ్, రఫీక్, మోతిలాల్, అలీముద్దీ పాల్గొన్నారు.