రేపు సీఎం రాక.. ఏర్పాట్లు పూర్తి: ఆది
NEWS Nov 19,2024 08:41 am
సీఎం రేవంత్ రెడ్డి బుధవానం వేములవాడ రానున్న నేపథ్యంలో దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మీడియాతో తెలిపారు. బుధవారం ఉదయం 10:30 గంటలకు దర్శన అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారని తెలిపారు. అధిక సంఖ్యలో ప్రజలు, నాయకులు, కార్యకర్తలు వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే పోలీస్ సిబ్బంది పటిష్ఠ భద్రత చర్యలు చేపట్టారు. ఎస్పీ క్షేత్ర స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.