ఘనంగా ఇందిరా జయంతి వేడుకలు
NEWS Nov 19,2024 08:47 am
భారతదేశ తొలి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ జయంతి వేడుకలను మల్యాల మండల కేంద్రంలోని బ్లాక్ చౌరస్తా వద్ద స్థానిక కాంగ్రెస్ నాయకులు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి ఆమె అందించిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.