నిజామాబాద్: మేయర్ నీతూకిరణ్ భర్త దండు శేఖర్పై దాడి ఘటనలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం నగరానికి చెందిన షేక్ రసూల్ శేఖర్పై దాడి చేసిన విషయం తెలిసిందే. దీంతో నిందితుడిని పట్టుకోడానికి 4 బృందాలతో పోలీసులు గాలించారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి నిందితుడు రసూల్ ను అదుపులోకి తీసుకొని మాక్లూర్ పోలీస్ స్టేషన్కు తరలించినట్లు తెలుస్తోంది.