‘పుష్ప 2’ టికెట్ ధరలు భారీగా పెంపు?
NEWS Nov 19,2024 06:11 am
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వస్తోన్న ‘పుష్ప 2’ మూవీ డిసెంబర్ 5న విడుదల కానుంది. ఈ క్రమంలో టికెట్ రేట్ల పెంపునకు సంబంధించి ఓ వార్త వైరల్ అవుతోంది. టికెట్ రేట్లు పెంచేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం APలో నగరాల్లో రూ.150-200 ఉన్న టికెట్ రేటును రూ.300కు పెంచేందుకు ప్రభుత్వాన్ని కోరనున్నట్లు టాక్. దీనిపై సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.