హనుమకొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా పాలన ప్రజా విజయోత్సవ సభ కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో జగిత్యాల జిల్లా నుంచి ప్రజా విజయోత్సవ సభ కార్యక్రమానికి బస్సుల్లో భారీగా సెర్ఫ్ మహిళా సంఘాలు తరలి వెళ్తున్నాయి. ఈ సందర్భంగా మహిళలు వెళ్తున్న బస్సులను జెండా ఊపి జగిత్యాల DRDO రఘువరన్ ప్రారంభించారు.