ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియో జకవర్గం ఎన్నికలకు సంబంధించి ఏడో రోజైన సోమవారం నలుగురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఎమ్మెల్సీ నియోజకవర్గ సహాయ రిటర్నింగ్ అధికారి,కాకినాడ జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావు వద్ద వారు నామినే షన్లు దాఖలు చేశారు. వీటితో కలిపి ఇప్పటి వరకూ మొత్తం ఆరు నామినేషన్లు దాఖలైనట్లు వెంకటరావు సోమవారం రాత్రి మీడియాకు తెలిపారు.