మున్సిపాలిటీ ఎన్నికలలో బీజేపీ జెండా ఎగరాలి
NEWS Nov 18,2024 04:02 pm
వచ్చే మున్సిపల్ ఎన్నికలలో బీజేపీ జెండా ఎగరాలని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉప అధ్యక్షుడు రుద్ర శ్రీనివాస్ అన్నారు. మెట్పల్లి పట్టణ బీజేపీ కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మెంబర్షిప్ డ్రైవ్ను విజయవంతంగా పూర్తి చేసిన వారిని అభినందించారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేష్, నాయకులు ధోనికెల నవీన్, సదాశివ్, సుఖేందర్ గౌడ్, యాదగిరి బాబు, మీనా, లావణ్య, శ్రీకాంత్ తదితరులున్నారు.