మెట్ పల్లి మాజీ ఎమ్మెల్యేకు నివాళులు
NEWS Nov 18,2024 04:01 pm
మెట్ పల్లి మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి జ్యోతి దేవి ఇటీవల మృతి చెందగా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నర్సింగ రావు, ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి సోమవారం ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాజీ జడ్పీటీసీ ఆకుల లింగారెడ్డి, మహేందర్ రెడ్డి, అంజిరెడ్డి తదితరులు ఉన్నారు.