ఇంటి స్థలాలు ఇవ్వాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సోమవారం మడకశిర తాహాసిల్దార్ కార్యాలయం వద్ద పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని మడకశిర పట్టణంలో సిపిఐ తాలూకా సెక్రెటరీ పవిత్ర ఆధ్వర్యంలో వైఎస్ఆర్ సర్కిల్ నుండి తాహాసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. ర్యాలీగా వెళ్లి డిప్యూటీ తాహసిల్దార్ లక్ష్మీనారాయణ కు వినతిపత్రం అందజేశారు