విద్యార్థులకు టై, బెల్ట్లు పంపిణీ
NEWS Nov 18,2024 12:31 pm
పిఆర్టియు జిల్లా ఉపాధ్యక్షుడు జి.నర్సింగరావు మనుమరాలు బోదీక్ష జన్మదినాన్ని పురస్కరించుకొని మల్లాపూర్ మండలంలోని రేగుంట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కె.దామోదర్ రెడ్డి సమక్షంలో విద్యార్థులకు ఉచితంగా టై, బెల్ట్లు పంపిణీ చేసారు. అనంతరం స్థానిక నివేదిత వృద్ధాశ్రమంలో అరటిపండ్లు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో పిఆర్టియు మండల అధ్యక్షులు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి రాజేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శంకర్ బాబు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.