వాడపల్లి వెంకన్నకు 3.85 లక్షల ఆదాయం
NEWS Nov 18,2024 12:32 pm
కోనసీమ తిరుమల ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వరస్వామిని సోమవారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి వివిధ సేవలు, విరాళాలు ద్వారా రూ.3,85,413 ఆదాయం లభించినట్లు ఈఓ తెలిపారు. ఆలయ నిర్వాహకులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు.