టీటీడీ సంచలన నిర్ణయాలు ఇవే..
NEWS Nov 18,2024 12:12 pm
TTD పాలక మండలి పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది. శ్రీవాణి ట్రస్టును రద్దు చేసింది. సామాన్య భక్తులకు 2, 3 గంటల్లోనే దర్శనం కల్పించేలా మార్పులు చేపట్టింది. కంపార్ట్మెంట్లలో భక్తులు ఇబ్బందులు పడకుండా త్వరితగతిన స్వామివారి దర్శనం కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించింది. అన్యమత TTD ఉద్యోగులను VRS లేదా ప్రభుత్వ శాఖల్లోకి బదిలీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు TTD ఛైర్మన్ BR నాయుడు ప్రకటన జారీ చేశారు.