వచ్చే ఏడాది ప్రారంభంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ షాక్ తగిలింది. నిన్న ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత కైలాశ్ గెహ్లాట్ తాజాగా బీజేపీలో చేరారు. ఆమ్ ఆద్మీలో ఆయన కీలక నేత. ఢిల్లీ రవాణా శాఖ మంత్రిగా పని చేశారు. ఆయన నిన్న మంత్రి పదవితో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు.