జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో నేడు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 41 ఫిర్యాదులో వచ్చినట్లు జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి వస్తారని వారి ఫిర్యాదులు స్వీకరించి సానుకూలంగా స్పందించాలని కోరారు.