చేగుంట మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో లోకమంతన్ పోస్టర్ తపస్ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తపస్ మెదక్ జిల్లా జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా లక్ష్మణ్ మాట్లాడుతూ.. లోకమంతన్ కార్యక్రమం శిల్పారామంలో నవంబర్ 21 నుండి 24 వరకు ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వుంటుంది అని చెప్పారు. ఈ కార్యక్రమంలో తపస్ నాయకులు శ్రీధర్ రెడ్డి, దేవానందు, వినోద్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.