పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండే కార్మికులకు వేతనాలు పెంచి, పెండింగ్ బిల్లులు చెల్లించాలని సోమవారం AITUC అధ్వర్యంలో జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట వంట కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలలో మధ్యాహ్న భోజన పథకం కింద వంట చేసే కార్మికులకు గత 6 మాసాలుగా మెస్ కోడిగుడ్లు, వేతనాల బిల్లులు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.