పరీక్ష కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్
NEWS Nov 18,2024 10:52 am
కోరుట్లలో జరుగుతున్న గ్రూప్-3 పేపర్-3 పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ సోమవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి పరీక్ష కేంద్రంలో ప్రశాంత వాతావరణంలో పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరీక్ష రాసే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో, ఎమ్మార్వో, మెట్పల్లి సీఐ నిరంజన్ రెడ్డి, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.