వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
NEWS Nov 18,2024 09:18 am
కోరుట్ల మండలం చిన్నమెట్పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ సత్యప్రసాద్ సోమవారం పరిశీలించారు. కొనుగోలులో జాప్యం చేయకుండా త్వరితంగా పూర్తి చేయాలని నిర్వాహకులను ఆదేశించారు. ధాన్యం నిల్వ ఉన్న రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తేమాంశం పరిశీలించి వెంటనే తూకం వేయాలని సిబ్బందికి సూచించారు.