బాలలను పనిలో చేర్చుకోవడం నేరం
NEWS Nov 18,2024 11:02 am
18 సంవత్సరాల లోపు బాలలను పనిలో చేర్చుకోవడం చట్టరీత్యా నేరమని రాజోలు సహాయ కార్మిక అధికారి కంభంపాటి భాస్కర్ రామాంజనేయ శర్మ చెప్పారు. సోమవారం బాల కార్మిక తనిఖీల్లో భాగంగా ఆలమూరు మండలంలో ఇటుక బట్టీలు, షాపుల్లో బాల కార్మిక శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. దీనిలో పోలీస్ డిపార్ట్మెంట్, ఐసిడిఎస్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు పాల్గొని ఇటుక బట్టి యజమానులకు 18 సంవత్సరాలలోపు చిన్నారులను పనిలో పెట్టుకోవద్దని సూచించారు.