పిఠాపురంలోని విరవాడ జంక్షన్లోని పీఎం విశ్వకర్మ కేంద్రం లో ఈ నెల 20న ఉద్యోగ మేళా నిర్వహిస్తునట్లు సూర్య ఎంటర్ప్రైజెస్ సంస్థ నిర్వాహకుడు సతీష్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళా కు పది, ఇంటర్, డిగ్రీ చదివి 32 ఏళ్లలోపు వయసున్న అభ్యర్థులు అర్హులన్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.