రైతులను మోసం చేసిన గతప్రభుత్వం
NEWS Nov 17,2024 05:33 pm
గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని విస్మరించిందని, రైతు సంక్షేమాన్ని కోరేది కాంగ్రెస్ పార్టీ అని కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జువ్వాడి నర్సింగరావు అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేస్తున్న లబ్ధి చూసి ఓర్వలేక మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ రైతులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.